బ్రదర్‌ ఇదేంది?

GHMC Office Damaged hyderabad - Sakshi

పెచ్చులూడిన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం

సాక్షి,సిటీబ్యూరో: భవనాల పటిష్టతపై అందరికీ మార్గదర్శకాలు జారీచేసే బల్దియా ప్రధాన కార్యాలయం పెచ్చులూడాయి. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురుకు రెండో అంతస్తులోని కమిషనర్‌ ఆఫీస్‌ వైపు పెచ్చులూడి కిందపడ్డాయి. మొహర్రం సెలవు కారణంగా సిబ్బంది ఎవరూ విధుల్లోలేకపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రెయిలింగ్‌ కూలిపోకయి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. నగరంలో భవన నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయాలని చెప్పే బల్దియా అధికారులు.. ప్రధాన కార్యాలయం పెచ్చులు ఊడి పడడం హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో సికింద్రాబాద్‌ చంద్రలోక్‌ అపార్ట్‌మెంట్‌ రెయిలింగ్‌ పడిపోయి ఓ వ్యక్తి మరణించిన విషయం విదితమే. ఇటీవల బల్దియా ప్రధాన కార్యాలయంలోనూ ఓ అడిషినల్‌ కమిషనర్‌ కార్యాలయంలోకి వర్షపునీరు చేరడంతో ఆ కార్యాలయానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top