వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా ఆలేరు మండలం శారాజిపేట శివారులోని హైదరాబాద్ - వరంగల్ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
మరిన్ని వార్తలు