కూతురిపై తండ్రి అఘాయిత్యం
షాబాద్(చేవెళ్ల): కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కన్నకూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవత్వం మరిచి.. జంతువులా ప్రవర్తించాడు. మానవత్వాన్ని మంటగలిపాడు. షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. షాబాద్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామానికి చెందిన వ్యక్తి తన కన్నకూతురి(16)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల ఆ బాలిక శరీరంలో మార్పులు కనిపించడంతో చిన్నాన్న, చిన్నమ్మలు ప్రశ్నించారు. దీంతో ఆ చిన్నారి తనపై తండ్రి చేసిన కిరాతకాన్ని వివరించింది. వారు బాలికను ఆదివారం రాత్రి షాబాద్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కీచక తండ్రిపై ఫిర్యాదు చేశారు. చేవెళ్ల ఏసీపీ ఉషావిశ్వనాథ్, చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్ బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు. నిందితుడు పదేళ్ల క్రితం భార్యను చంపినట్లు తెలిసింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, బాధిత బాలిక పెద్దకూతురని తెలుస్తోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మను చంపినట్లు నిన్నూ చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.