బైక్తో సేద్యం
మోత్కూరు యాదాద్రి : పంట చేలల్లో గుంటకల సాయంతో దున్న కం చేసే విధానానికి బదులు బైక్తో సాగించాడు.. మో త్కూరు మండలంలోని బుజిలాపురంలోని ఓ యువరైతు. గ్రామానికి చెందిన రైతు గిరగాని శంభయ్యగౌడ్ తన బైక్ వెనుకబాగానికి గుంటుక అమర్చాడు. శంభయ్య బైక్ నడుపుతుండగా మరో వ్యక్తి గుంటుకను పత్తి సాళ్లలో ఒత్తి పట్టుకుని కలుపు తొలగించారు.
పశువుల లేక, కూలీలకు అధిక డబ్బులు ఇవ్వలేక ఇలా వినూత్న ఆలోచన చేశాడు. అరక తోలడానికి ఎకరానికి సుమారు రూ.600 కూలి చెల్లించాల్సి వచ్చేది. కూలీలకు ఎకరానికి సుమారు రూ.1000 నుంచి రూ.1500 ఖర్యయ్యేది. బైక్ ద్వారా కేవలం లీటర్ పెట్రోల్తో ఎకరం పత్తిచేలో గుంటుక తోలినట్లు రైతు తెలిపాడు.