అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మద్దూరు: మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం జాదరైపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి సాయిలు(30) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ భరించలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.