రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి చెందారు. మోతె మండలం నామవరం శివారులో సోమవారం జరిగింది. మండలంలోని తుమ్మలపల్లకి చెందిన మాజీ సర్పంచ్ వెన్నం సత్యనారాయణరెడ్డి(53) తుమ్మలపల్లి నుంచి సూర్యాపేటకు బైక్ పై వెళ్తుండగా పెట్రోల్బంక్ సమీపంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరారైయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.