ప్రతి కార్యకర్తకు శక్తి యాప్తో గుర్తింపు: భట్టి
సాక్షి, ఖమ్మం: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ కర్యకర్తలు, నాయకులు, అభిమానుల అభిప్రాయాలను తెలుసుకునేందుకే శక్తి యాప్ ప్రాజెక్టును చేపట్టినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడింట్ మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ పటిష్టతను మరింత పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
ప్రతి కార్యకర్త తన అభిప్రాయాలను, సూచనలను ఈ యాప్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ యాప్ ద్వారా గ్రామస్థాయి నుంచి మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతి కార్యకర్త తమతమ అభిప్రాయాలను పార్టీతో పంచుకునే అవకాశం ఉందని భట్టి పేర్కొన్నారు.