మా ఆయనను గెలిపించండి
పతి విజయం కోసం సతీమణి ప్రచారం
ఇంటింటికీ బొట్టుతో మహిళలను ఆకట్టుకుంటున్న ఉషాదయాకర్రావు
పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్రావును అధిష్టానం ప్రకటించడంతో ఎన్నికల ప్రచారంలో ఆయన నిమగ్నమయ్యారు. ఆయన సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఉషా దయాకర్రావు కూడా తన భర్త గెలుపు కోసం నియోజకర్గవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇంటింటికి వెళ్లి బొట్టుపెడుతూ ఓట్లడిగారు. తీగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి మహిళలతోపాటు కుటుంబ సభ్యులకు బొట్టు పెడుతూ దయాకర్రావును గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి దయాకర్రావుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. గ్రామాల్లో ఇంటింటికి బొట్టు పెడుతూ ఓటడిగే తీరు, పతి విజయం కోసం సతీమణి చేస్తు న్న ప్రచారంపై మహిళలు ఆకర్షితులవుతున్నారు.