చాలెంజ్ ఓటు అంటే..?
సాక్షి, షాద్నగర్ టౌన్: ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే చాలెంజ్ ఓటు అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఓటరు జాబితాలో పేరు ఉన్నా ఓటుకు అనర్హుడని పోలింగ్ కేంద్రంలో వివిధ పార్టీల ఏజెంట్లు సవాల్ చేయడాన్ని చాలెంజ్ ఓటు అంటారు.
ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫొటో ఇతర వివరాలు సక్రమంగా ఉన్నా.. ఏజెంట్లు ఆ వ్యక్తి బోగస్ అని పోలింగ్ అధికారికి తెలియజేస్తారు. సదరు పోలింగ్ అధికారి ఓటరు ఫిర్యాదును పరిశీలించి ఏజెంట్ నుంచి ఐదు రూపాయల రుసుము తీసుకొని రశీదు ఇస్తారు.
ఎన్నికల అధికారులు స్ధానిక సిబ్బందితో ప్రా«థమిక విచారణ చేయించి, అన్ని సక్రమంగా ఉంటే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ప్రాథమిక విచారణలో ఓటరు బోగస్ అని తేలితే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దీనినే చాలెంజ్ ఓటుగా వ్యవహరిస్తారు.