‘స్క్రీనింగ్‌ టెస్ట్‌ లేకుండా అస్సలు పంపొద్దు’

Covid 19: Etela Rajender Strict Instructions To Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విమాన ప్రయాణం అనంతరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు తప్పకుండా స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టును దిగ్బంధం చేయాలని, ఒక్కరిని కూడా స్క్రీనింగ్‌ టెస్ట్‌ లేకుండా బయటకు పంపొద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస్‌రావులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల మధ్యలో మంత్రి వారితో ఫోన్‌లో మాట్లాడారు. పాజిటివ్‌ వ్యక్తులను కలిసిన వారం దరికీ రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లతో పరీక్షలు చేయించాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top