పెళ్లికి వెళ్లొస్తూ తిరిగి రాని లోకాలకు..


రుద్రంపూర్ (ఖమ్మం) : పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న ఇద్దరు దంపతులను మృత్యువు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఐటీఐ బ్రిడ్జి వద్ద వేగంగా వెళ్తున్న తవేరా వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో మృతులు కారేపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన రామ్‌జీ, శాంతగా గుర్తించారు. వీరు చంద్రుగొండ మండలం పెనగడపలో వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top