తెలంగాణ ఐఏఎస్కు ‘కరోనా’ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్ అధికారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. సదరు ఐఏఎస్ అధికారికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనకు గాంధీ ఆస్పత్రి వైద్యులు వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నట్టు సమాచారం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటివరకు భారత్లో 39 మందికి సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి కరోనా వైరస్ నిర్దారణ రిపోర్ట్పై ఉత్కంఠ నెలకొంది.