తెలంగాణలో ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్‌ కేసులు

Coronavirus : Another 43 Corona Cases Rises In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. తాజాగా శనివారం ఒక్కరోజే కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 272కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం  228 మంది కరోనా బారీన పడి చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో  11 మంది మృతి చెందగా , మరో 33 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో కరోనా వైరస్‌ కమ్యునిటీ స్ప్రెడ్‌ జరగడంలేదు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, లేదా వారితో కలిసిన వారు మాత్రమే ఉన్నారు. మర్కజ్‌ నుంచి వచ్చిన 1090 మందిని గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని క్వారంటైన్లలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top