తెలంగాణ: 74 పాజిటివ్‌.. ఆరుగురు మృతి

Coronavirus 74 New Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2499 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 41, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి 3, మహబూబ్‌నగర్‌ 2, జగిత్యాల 2, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌, వికారబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు.
(చదవండి : జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు)

వలసదారుల్లో 9 మందికి, విదేశాల నుంచి వచ్చిన 5 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. శుక్రవారం ఆరుగురు మరణించారు. దీంతో వైరస్‌ బారినపడి మరణించిన వారి మొత్తం సంఖ్య 77కు చేరింది. తాజాగా 31 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1412 కు చేరుకుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1010 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆయన  తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top