తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 23902కు చేరింది. ఇందులో 10904 యాక్టివ్ కేసులు ఉండగా, 12703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం కరోనాతో మరో ఏడుగురు చనిపోగా, ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 295కి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. ఈ రోజు నమోదైనా కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1277 ఉన్నాయి.
సంబంధిత వార్తలు