తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా కరోనాతో కోలుకున్న1,281 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 37,666కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 438గా నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 842 ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసులు