భానుడి చుట్టూ రంగుల వలయం

భానుడి చుట్టూ రంగుల వలయం - Sakshi


భిక్కనూరు (నిజామాబాద్): ఆకాశంలో సోమవారం సూర్యుడి చుట్టూ గంటపాటు రంగులతో కూడిన వలయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాక్షి’ పాఠకుడు కుర్రి నవీన్‌కుమార్ ఈ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశంలో సూర్యుడి చుట్టూ కనిపించిన ఈ వలయాన్ని చూసిన స్థానికులు సంబురపడ్డారు.



రాత్రి పూట చంద్రుని చుట్టూ వలయం ఏర్పడం సహజమేనని, సూర్యుని చుట్టూ వలయం ఏర్పడం చాలా ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని పలువురు చెప్పారు. ఇలా ఏర్పడిన తర్వాత వారంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top