భానుడి చుట్టూ రంగుల వలయం
భిక్కనూరు (నిజామాబాద్): ఆకాశంలో సోమవారం సూర్యుడి చుట్టూ గంటపాటు రంగులతో కూడిన వలయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాక్షి’ పాఠకుడు కుర్రి నవీన్కుమార్ ఈ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశంలో సూర్యుడి చుట్టూ కనిపించిన ఈ వలయాన్ని చూసిన స్థానికులు సంబురపడ్డారు.
రాత్రి పూట చంద్రుని చుట్టూ వలయం ఏర్పడం సహజమేనని, సూర్యుని చుట్టూ వలయం ఏర్పడం చాలా ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని పలువురు చెప్పారు. ఇలా ఏర్పడిన తర్వాత వారంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.