సీఎంకు ముడుపులు ముట్టాయి: మందకృష్ణ

సీఎంకు ముడుపులు ముట్టాయి: మందకృష్ణ - Sakshi


హన్మకొండ : సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ. 2, 500 కోట్ల చెల్లింపుల్లో  ముఖ్యమంత్రికి రూ. 200 కోట్లు కమిషన్‌గా ముట్టాయనే ఆరోపణలు వచ్చాయని, ఈ మేరకు సీఎంను కూడా గవర్నర్ బర్తరఫ్ చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.



రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడానికి కేసీఆర్ ముందే ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. దీనికి నిరసనగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. మాదిగలను అణగదొక్కాలని నిర్ణయించుకున్న కేసీఆర్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రాజయ్యపై  వేటు వేశారని ధ్వజమెత్తారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top