ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం సాయం త్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. కేసీఆర్తోపాటు ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా వెళ్లారు. నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న ముఖ్యమంత్రి.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుసుకునే అవకాశముంది. కేంద్ర బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం ఆశలను నీరుగార్చింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులతోపాటు, కేంద్రం ఇచ్చిన హామీలు, రావాల్సిన నిధులు, ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ‘విభజన’ అంశాలను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. కాగా ఐదు నెలల కిందట ముఖ్యమంత్రి ఢిల్లీలోనే కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.