గవర్నర్తో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేశారు.
మరో పక్క వివిధ పార్టీలు కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. మరికొద్ది సేపట్లో తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా సమావేశం కానుంది.