రుణమాఫీపై బ్యాంకర్లతో కేసీఆర్ సమావేశం
రైతు రుణాల మాఫీ అంశంపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు రుణమాఫీతో పాటు పలు ఆర్థిక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రైతులకు రుణమాఫీ చేయాలని, దాంతోపాటు డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేయాలంటే ఎంత భారం పడుతుందని లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి, కొంతమేర బ్యాంకులకు ఆర్థిక భారంగా ఉన్నా కూడా రుణాల మాఫీ విషయంలో మాత్రం వెనకడుగు వేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.