రైళ్ల రాకపోకల్లో మార్పులు

Changes in the traffic of trains - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పూడూరు– ఇటిక్యాల స్టేషన్‌ల మధ్య జరుగుతున్న ఆర్‌యూబీ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 26, 28ల్లో కాచిగూడ–మహబూబ్‌నగర్‌ ప్యాసింజర్‌ రైలును పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ– కర్నూలు సిటీ ప్యాసింజర్‌ 28వ తేదీన మహబూబ్‌నగర్‌ వరకే పరిమితం కానుందని తెలిపారు.  

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ ఏర్పాటు
రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ – సికింద్రాబాద్‌– విజయవాడ శాతవాహన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12713/12714)కు శాశ్వత అదనపు సెకండ్‌ సిట్టింగ్‌ బోగీ ఏర్పాటు చేసినట్టు విజయవాడ డివిజన్‌ ఇన్‌ చార్జ్‌ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top