టీడీపీ సీనియర్లతో చంద్రబాబు అత్యవసర భేటీ

Chandrababu Emergency Meeting With TDP Senior Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ సీనియర్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌ రమణ, రావుల పెద్దిరెడ్డి ఇతర నాయకులు పాల్గొననున్నారు.

తెలంగాణ ఎన్నికలు, టీడీపీ వ్యూహం, పొత్తులపై ప్రధానంగా చర్చజరగనుంది. చంద్రబాబు ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ కమిటీ, ప్రచార కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలా? వద్దా? అన్నదానిపై సమీక్ష చేయనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తెలంగాణ నాయకత్వానికి స్పష్టత ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top