పెళ్లయిన కొన్ని గంటలకే గుండెపోటుతో..

A Bride Dies With Heart Attack In Suryapet District - Sakshi

సాక్షి, సూర్యాపేట: వివాహం జరిగిన ఇంట్లో కొన్ని గంటల్లోనే విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగిన రోజే వధువు మృతి చెందడం వధూవరుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేటకు చెందిన గాయత్రి అనే యువతికి వేణు అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. జె గార్డెన్స్‌లో రెండు కుటుంబాల బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం మధ్యాహ్నం గాయత్రి, వేణుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వివాహం జరిగిన కొన్ని గంటలకే వధువు మృతిచెందింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో నవ వధువు గాయత్రి చనిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top