మాయమాటలు చెప్పి ఏడాది నుంచి..

A boy fraud to the girl in the name love in Bhadradri district

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం:  ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన కొత్తగూడెంలోని చుంచుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. వివరాలివి.. కొత్తగూడెం మండలం సర్వారం గోపతండాకు చెందిన బాణోతు చందన(18), చుంచుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సాయిప్రదీప్‌(19)  ఏడాది నుంచి ప్రేమించుకున్నారు.

మాయమాటలు చెప్పి ఏడాది నుంచి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. ప్రియుడి వద్ద ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి కనుమరుగయ్యాడు. పది రోజుల నుంచి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో చందన తన కుటుంబసభ్యులతో కలసి, సాయిప్రదీప్‌ ఇంటి వద్ద నిరసన చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top