బీజేపీ, కాంగ్రెస్‌ విధానాలు ఒకటే

The BJP and Congress Policies are The Same - Sakshi

ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హన్మకొండ : దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ విధానాలు ఒకటేనని, ఈ రెండు  పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నుట్లు తమ్మినేని తెలిపారు. ఆదివారం  హన్మకొండ రాంనగర్‌లోని సీపీఎం కార్యాలయంలో సారంపల్లి వాసుదేవరెడ్డి అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ పార్టీ 22వ జాతీయ కాంగ్రేస్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశామన్నారు.  కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితిలో పొత్తులు ఉండవన్నారు.  సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేష్, అంజన్‌రావ్, కుమారస్వామి, నాగేశ్వర్‌రావు, వెంక ట్, వీరన్నతోపాటు సారంగపాణి, అనందకుమార్, సుధాకర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top