‘ఆన్షోర్ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రాజెక్టుల భద్రతకు ఆన్షోర్ సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది. శనివారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో జరిగిన తొలి సమావేశం లో కమిటీ చైర్మన్, డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో గెయిల్ సెక్యూరిటీ అడ్వైజర్, కమిటీ కన్వీనర్ ప్రమోద్కుమార్, ఐపీఎస్లు, పలు గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రాజెక్టులకు పటిష్ట భద్రత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ వెల్లడించారు.
పోలీస్ శాఖ తరుపున శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ స్కీం కింద ఆయా గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని కంపెనీల ప్రతినిధులను కోరారు. సమావేశంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్సింగ్, పోలీస్ కమిషనర్లు, కేంద్ర హోంశాఖ డిప్యూ టీ డైరెక్టర్ కేఎస్ ప్రసాద్, గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.