వర్ధెల్లి లక్ష్మమ్మకు ప్రముఖుల నివాళి
సాక్షి, సూర్యాపేట : సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ భౌతికకాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.
సూర్యాపేటలోని తమ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. లక్ష్మమ్మ మృతిపట్ల సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, చెరుకు సుధాకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.