లారీని ఢీకొన్నఆర్టీసీ బస్సు


మిర్యాలగూడ: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ బైపాస్ రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు దాచెపల్లి నుంచి మిర్యాలగూడ వస్తున్న సమయంలో ఈదుల గూడ బైపాస్ వద్ద లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top