తెలంగాణలో మరో 7 కరోనా కేసులు

7 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్టంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. శుక్రవారం 13 కేసులు నమోదు కాగా, శనివారం ఆ సంఖ్య 7కు తగ్గింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 990కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 25 మంది మృత్యువాత పడగా.. 307 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 658గా ఉంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top