తెలంగాణలో మరో 52 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 644కు చేరుకుంది. ఇవాళ కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 110 మంది డిశ్చార్జ్ అయ్యారు.