తెలంగాణలో మరో 43 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా మరో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 31, గద్వాల్ 7, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండలో ఒకరికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది. కాగా, వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు.