రాష్ట్రంలో మరో 38 పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1699కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు వైరస్ కారణంగా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 45కి చేరింది. కొత్తగా నమోదైన వాటిల్లో జీహెచ్ఎంసీలో 26, రంగారెడ్డిలో 2 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
మరోవైపు 10 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారందరినీ క్వారెంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్బులిటెన్ విడుదల చేసింది. (స్వీడన్లో కరోనా మృతుల శాతం ఎక్కువ!)