తెలంగాణలో మరో 3 పాజిటివ్
అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే..
రాష్ట్రంలో 1,085కి చేరిన కేసులు
తాజాగా 40 మంది డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,085కి చేరుకుంది. తాజాగా 40 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు 585 మంది కోలుకొని ఇంటికి వెళ్లారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు. తాజాగా నమోదైన మూడు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని తెలిపారు. ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 471 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదై పది వారాలు పూర్తయ్యాయి. చదవండి : కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : పువ్వాడ
ఏ వారంలో ఎన్ని కేసులు?
తొలి వారం - (మార్చి 2) 1
రెండో వారం - (మార్చి 3 – 9) 0
మూడో వారం - (మార్చి 10–16) 2
నాలుగో వారం - (మార్చి 17–23) 30
ఐదో వారం - (మార్చి 24–30) 56
ఆరో వారం - (మార్చి 31–ఏప్రిల్ 6) 303
ఏడో వారం - (ఏప్రిల్ 7 –13) 153
ఎనిమిదో వారం - (ఏప్రిల్ 14–20) 366
తొమ్మిదో వారం - (ఏప్రిల్ 21–27) 97
పదో వారం - (ఏప్రిల్ 28– మే 4) 77