ఎలక్ట్రిక్ స్టౌ లో బంగారం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం బయటపడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయి నుంచి ఓ వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా అందులో కిలో బంగారం బయటపడింది. ఎలక్ట్రానిక్ స్టౌ లో బంగారం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుడు ముంబై వాసిగా గుర్తించారు.