4.5 కిలోల గంజాయి స్వాధీనం


కొండమల్లేపల్లి : నల్గొండ జిల్లాలోని దేవరకొండ మడలం బేమనపల్లెలో శనివారం ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు దేవరకొండ పోలీసులు గంజాయి తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టి పంచనామా నిర్వహించారు. పూర్తి వివరాలను సాయంత్రం మీడియా సమావేశంలో వివరిస్తామని పోలీసులు చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top