పెద్ద పులి రేవతి మృతి
భువనేశ్వర్: స్థానిక బారంగ్ నందన్ కానన్లో పెద్ద పులి రేవతి మృతి చెందింది. బుధ వారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఈ పులి కన్ను మూసినట్టు నందన్ కానన్ డైరెక్టర్ జయంత్ దాస్ ప్రకటించారు. 18 ఏళ్ల రేవతి వయోభారం వల్ల అనారోగ్యంతో మరణించినట్టు వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. గత 2 నెలలుగా ఆహారం తీసుకోవడం తగ్గించి క్రమంగా క్షీణించింది. 20 రోజులు నుంచి ఐసీయూలో దీనికి చికిత్స అందించారు. రోహిత్, శైలజకు 1999 సంవత్సరంలో రేవతి జన్మించింది. రేవతి మరణంతో నందన్కానన్లో ప్రస్తుతం 24 పులులు మిగిలాయి. వీటిలో 8 తెల్ల పులులు, 12 ఆడ పులులు ఉన్నాయి.