కంసాలి బేతపూడిలో ఆందోళన
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామంలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రులోని ఆక్వాపుడ్ పార్క్ ముట్టడికి గ్రామస్తులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గ్రామస్తులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.