చెన్నై విమానాశ్రయంలో యువకుడి ఆత్మహత్య
అన్నానగర్ (చెన్నై): విజయవాడకు చెందిన యువకుడు చెన్నై విమానాశ్రయం బ్రిడ్జ్పై నుంచి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై విమానాశ్రయానికి ప్రయాణికులు వచ్చే ప్రాంతం లో సోమవారం ఉదయం 6:45కి విజయవాడ న్యూగిరిపురానికి చెందిన చైతన్య (28) చాలాసేపు ఫోన్లో మాట్లాడాడు.
ఈ ప్రాంతంలో కారు, బైకు వంటి వాహనాలు వెళ్లడానికి 50 అడుగుల ఎత్తైన వంతెన ఉంటుంది. దీనిపై నుంచి ఆ యువకుడు హఠాత్తుగా కిందకు దూకేయ డంతో గాయపడి ఘటనాస్థలి లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న విమా నాశ్రయ పోలీసులు అక్కడికి వచ్చి యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. దీనిపై పోలీసులు విచారణ చేయగా బ్రిడ్జ్ నుంచి కిందకు దూకిన యువకుడి పేరు, చిరునామా తెలిసింది.