వచ్చే సమావేశాల్లో ‘ఓబీసీ’కి చట్టబద్ధత

వచ్చే సమావేశాల్లో ‘ఓబీసీ’కి చట్టబద్ధత


సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావే శాల్లోనే ఓబీసీ కమిషన్‌ బిల్లుకు చట్టబద్ధత లభిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. గురు వారం ఆయన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌తో సమావేశమై ఓబీసీ బిల్లుపై చర్చించారు. గత సమావేశం లో లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందినా కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలతో రాజ్యసభలో బిల్లును ఆడ్డుకుందన్నారు. వచ్చే సమావేశా ల్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా బిల్లును ఆమోదింప చేస్తామని గెహ్లాట్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు.



 ఈ బిల్లు ఆమోదం పొందితే సివిల్‌ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు ఈ కమిషన్‌కు వస్తా యన్నారు. దీనివల్ల ఓబీసీలకు రాజ్యాంగ పరంగా లభించాల్సిన హక్కులు సక్రమంగా అమలవుతాయన్నారు. అలాగే సికింద్రాబాద్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే బాలబాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని గెహ్లాట్‌ హామీ ఇచ్చారన్నారు. ఈ నెల 8న హైదరాబా ద్‌లోని విజయనగర్‌ కాలనీలో గరీబ్‌ కౌశల్‌ వికాస్‌ కేంద్రానికి కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ శంకుస్థాపన చేస్తారన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top