ఎమ్మెల్యేకు స్వైన్ ఫ్లూ
పింప్రి, న్యూస్లైన్: స్వైన్ ఫ్లూ రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. కోత్ రోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేధా కులకర్ణికి స్వైన్ ఫ్లూ సోకిందని జీజేపీ కార్పొరేటర్ తెలిపారు. ఆమె యరండవానాలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ కార్పొరేటర్ డిమాండ్ చేశారు.