కారుబోల్తా: ముగ్గురు మృతి
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తొర్రూర్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తొర్రూరు మండలం పటేల్ గూడెంనకు చెందిన బాపు రెడ్డి (35), మునీందర్ (25), శ్రీకాంత్(20) అనే వారు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను తొర్రూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.