అశ్విన్‌పైనే మా దృష్టి: ధోని

We will definitely try to get R Ashwin back in CSK: MS Dhoni - Sakshi

చెన్నై: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో భాగంగా వేలంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకోవడంపైనే దృష్టి సారించినట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్పష్టం చేశాడు. సాధ్యమైనంత వరకూ అశ్విన్‌ను దక్కించుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ ఫ్రాంచైజీ పరంగా చూస్తే లోకల్‌ బాయ్‌ అశ్విన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోమని ధోని ఈ సందర్బంగా పేర్కొన్నాడు.

ఇప్పటికే రిటెయిన్‌ పాలసీ ప్రకారం ముగ్గురు భారత ఆటగాళ్లని తిరిగి దక్కించుకున్న నేపథ్యంలో  రైట్‌ టు మ్యాచ్‌ (వేలం సమయంలో) మరో ఇద్దర్ని ఫ్రాంచైజీ కొనసాగించే వీలున్న క్రమంలో అశ్విన్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నాడు.  అయితే వేలం సందర్బంగా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేనని ధోని ఒక ప్రశ్నకు సమాధానంగా చుప్పాడు. ఆ సమయంలో ఏమి జరుగుతుందనే దాని కోసం కచ్చితంగా నిరీక్షించకతప్పదన్నాడు.రిటెయిన్‌ పాలసీ ప్రకారం సీఎస్‌కే జట్టులో ధోనితో పాటు సురేశ్‌ రైనా, జడేజాలు తిరిగి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్‌ వేలం జరగనుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top