బూట్లు విసరడంపై జడేజా స్పందన
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మంగళవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. కావేరీ జలాల వివాదాల కారణంగా నిరసనల నేపథ్యంలో నిరసనకారులు మ్యాచ్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. మైదానంలోకి ప్రవేశించిన కొంతమంది క్రికెటర్లపైకి బూట్లు విసిరారు. అంతేకాక.. కొందరు మరింతగా రెచ్చిపోయి.. క్రికెట్ అభిమానులపై దాడి చేశారు. ఈ క్రమంలోనే డుప్లెసిస్, జడేజా వంటి ఆటగాళ్లపై ఆందోళనకారులు బూట్లు విసిరారు. మరొకవైపు చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లను వేరే చోట నిర్వహించడానికి దాదాపు రంగం సిద్ధమైంది.
తమపై బూట్లు విసరడంపై జడేజా స్పందిస్తూ..‘మాకు సీఎస్కే ఫ్యాన్స్పై చాలా ప్రేమ, అప్యాయత ఉంది. అది ఎప్పటికీ అలానే ఉంటుంది' అని ట్విట్టర్ వేదికగా జడేజా పేర్కొన్నాడు. దీనికి బూట్లు విసిరిన ఫొటోనే జడేజా జత చేశాడు. దీనిపై పలువురు చెన్నై అభిమానులు సైతం స్పందిస్తున్నారు. తమకు సీఎస్కే అంటే ప్రాణమని, కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఈ పనులు చేస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.
Still we have a lots of love and care for our csk fans. #fans #csk pic.twitter.com/HRE0fu0sEW
— Ravindrasinh jadeja (@imjadeja) 11 April 2018
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు