విరాట్ ఈజీగా తీసుకోడు: రైనా
కేప్టౌన్:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో అంత ఈజీ కాదని అంటున్నాడు మిడిల్ ఆర్డర్ ఆటగాడు సురేశ్ రైనా. గేమ్ జరుగుతున్నప్పుడు ప్రతీ విషయాన్ని విరాట్ చాలా సీరియస్గా తీసుకుంటాడని రైనా పేర్కొన్నాడు. మ్యాచ్లో విజయం సాధించాలనే తపనతోనే కోహ్లి కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటాడన్నాడు. శనివారం సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న ఆఖరిదైన మూడో టీ20 జరుగనున్న నేపథ్యంలో రైనా మాట్లాడాడు.
'నాపై కోహ్లి నమ్మకం ఉంచడంతోనే జట్టులో స్థానం సంపాదించాను. ఇది నాకు నిజంగా చాలా ముఖ్యం. ఒక కెప్టెన్ నమ్మకాన్ని సంపాదించి జట్టులో పునరాగమనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20ల్లో తొలి రెండు గేమ్ల్లో మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా పేసర్లు అద్భుతంగా రాణించారు. ఫినిషింగ్ కూడా ఘనంగా ఉండాలనే భావిస్తున్నాం. మా కెప్టెన్ కోహ్లి కూడా భావిస్తున్నది ఇదే. ఏ విషయాన్నైనా కోహ్లి ఈజీగా తీసుకోడు. విజయం కోసం కడవరకూ పోరాడే తత్వం కోహ్లిది. ఆ క్రమంలోనే ఆటగాళ్లపై కొన్ని సమయాల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తాడు. తొలి ఆరు ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే భారీ స్కోరుకు ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్ చేసే సమయంలో మొదటి ఆరు ఓవర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి' అని రైనా తెలిపాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు