150 పరుగులు: కోహ్లి ముద్దు వెనుక ఆంతర్యమిదే..!

 Virat Kohli Kisses Wedding Ring After Crossing 150 - Sakshi

టీమిండియా కెప్టెన్‌, డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో వరుసగా వికెట్లు కోల్పోయి.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సారథిగా నిలబడి.. దీటైన ఆటతీరు కనబర్చాడు. బాధ్యతాయుతంగా ఆడి 153 పరుగులు చేసిన కోహ్లి.. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు భారీ ఆధిక్యాన్ని సాధించకుండా అడ్డుపడ్డాడు. కోహ్లి (153; 217 బంతుల్లో 15 ఫోర్లు‌) భారీ సెంచరీతో భారత జట్టు 300 పరుగుల మార్కును దాటింది. ఒకవైపు వికెట‍్లు పడుతున్నా.. నిలకడగా ఆడిన కోహ్లి.. టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో 150 పరుగులు పూర్తి చేసిన తర్వాత కోహ్లి మైదానంలో చేసిన ఓ చర్య అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రెండో టెస్టు మూడోరోజు మోర్నే మోర్కెల​ వేసిన 89వ ఓవర్‌లో కోహ్లి 150 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ సందర్భంగా తన మెడలో గొలుసుకు ఉన్న ఉంగరాన్ని కోహ్లి ముద్దాడాడు. ఈ ఉంగరాన్ని ఎందుకు ముద్దాడాడంటే.. అది తన వివాహ నిశ్చితార్థపు ఉంగరం. కోహ్లి ఇటీవల తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను అట్టహాసంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అనుష్కపై తనకున్న గాఢమైన ప్రేమను చాటుతూ.. మరోసారి ఎంగెజ్‌మెంట్‌ రింగ్‌ను కోహ్లి మైదానంలో ముద్దాడడంతో స్వచ్ఛమైన అనుబంధానికి ఇదే ప్రతీక అంటూ అతని అభిమానులు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top