స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై

స్నూకర్‌ టోర్నీలో రన్నరప్‌ విద్యా పిళ్లై


సింగపూర్‌: భారత క్రీడాకారిణి విద్యా పిళ్లై ప్రపంచ మహిళల స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో విద్య 5–6 ఫ్రేమ్‌లతేడాతో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఎన్గ్‌ ఓన్‌ యి (హాంకాంగ్‌) చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ నుంచి ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ల విద్య తుది పోరులో ఒకదశలో 4–2 ఫ్రేమ్‌లతో విజయానికి చేరువైంది. అయితే కీలకదశలో ఈ తమిళనాడు క్రీడాకారిణి ఏకాగ్రత కోల్పోయి, తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top