వైరల్‌ : కోహ్లి, ధావన్‌, రైనాల ఫన్‌టైం

Suresh Raina Shares Kohli Fun Bonding Pic - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌ ప్రారంభానికి ఇంకొంత సమయం ఉండటంతో భారత క్రికెటర్లు ఈ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఒక జట్టుగా ఆడిన ఆటగాళ్లు ఐపీఎల్‌తో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా సురైష్‌ రైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. నిదహాస్‌ ట్రోఫీలో ఆకట్టుకున్న ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జట్టుగా ఉన్న బంధం ఇక సరదా బంధానికి దారితీస్తోంది’ అనే క్యాఫ్షన్‌తో ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో రైనాతో పాటు కెప్టెన్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌లున్నారు.

గత రెండు సీజన్లలో గుజరాత్‌ లయన్స్‌కు సారథిగా వ్యవహరించిన రైనా ఈ సీజన్‌లో తన పాత జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని సారథ్యంలో ఆడనున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి రాయల్‌ చాంలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ధావన్‌ డెవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడనున్నాడు. ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఈ స్టార్‌ ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top