ఆమె ధైర్యానికి సెల్యూట్‌: సురేష్‌ రైనా

ఆమె ధైర్యానికి సెల్యూట్‌: సురేష్‌ రైనా


సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మూకశ్మీర్‌లోని ఏర్పాటువాద ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. కశ్మీర్‌లోని బక్షి స్టేడియంలో భారత జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కానీ వేర్పాటువాదుల ప్రభావిత ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరిమితులు విధించారు.



అయితే ఏర్పాటువాదుల ప్రభావం ఎక్కువగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో భారత్‌మాతాకీ జై నినాదాలు వినిపించాయి. శ్రీనగర్‌కు చెందిన కశ్మీరీ పండిత్‌ మహిళ,  ఉద్రిక్త  వాతావరణం ఉన్న లాల్‌ చౌక్‌ రోడ్లపై 'భారత్‌ మాతాకీ జై, మీరు కూడా భారత్‌లోని వారే, భారత్‌మాతాకీ జై అనడం మన బాధ్యత' అంటూ నినదించింది. ఈవీడియోకు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈవీడియోను భారత బ్యాట్‌మెన్‌ సురేష్‌రైనా షేర్‌ చేశారు. 'ఆమె చాలా ధైర్యవంతురాలు, ఆమె చేసిన సాహాసానికి సెల్యూట్‌' అంటూ పోస్టు చేశారు. ఆమె చేసిన నినాదాలు అన్ని ఉద్రిక్తల మధ్య సంతోషాన్ని కలిగించిందంటూ ప్రశంసించారు.

 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top