నాలుగో స్థానానికి అయ్యరే సరైనోడు

Sunil Gavaskar wants Shreyas Iyer, not Rishabh Pant - Sakshi

సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్‌లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి శ్రేయస్‌ అయ్యర్‌ సరిగ్గా సరిపోతాడని భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. రిషభ్‌ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కంటే అయ్యర్‌ని ఆడిస్తేనే జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన విశ్లేషించారు. జట్టు మేనేజ్‌మెంట్‌ నాలుగో స్థానాన్ని శాశ్వతంగా ఆయ్యర్‌కు కేటాయించాలని గావస్కర్‌ సూచించారు. ‘ నా దృష్టిలో పంత్‌ ధోనిలా ఫినిషర్‌... అతనికి ఐదు లేదా ఆరో స్థానాన్ని కేటాయిస్తే మంచిది. కానీ అయ్యర్‌ అలా కాదు ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. అందుకోసం అయ్యర్‌కు... భారత్‌ను చాలా కాలం నుంచి వేధిస్తోన్న నాలుగో స్థానాన్ని కేటాయిస్తే మంచిది’ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top